సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మెగాస్టార్
కరోనా వల్ల తెలుగు చిత్రపరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకునే బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను ప్రభుత్వాలు విడుదల చేయాలని కోరారు.