సబ్ కా మాలిక్ ఎక్ హై-ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
సిద్ధిపేటలో మిలాద్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం క్విజ్ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ కరోన సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ వారి యోగ, క్షేమాలు చూస్కున్నారని అదేవిధంగా పిల్లలకు బడిలో నేర్పే పాఠాలను టివి, ఫోన్ ద్వారా అందించే ప్రయత్నం చేసారని, అదేవిధంగా పిల్లలు కూడా విద్యను అందిపుచ్చుకుని వివిధ పోటీల్లో పాల్గొంటూ ఉన్నత భవిష్యత్తును సంపాదించుకొని తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని, ఆధ్యాత్మిక, సంస్కృతిక విలువలు పెంపొందించుకోవాలని నమాజ్ చేసిన, యోగ చేసిన శారీరక ఆరోగ్యం కోసమే అని సబ్ కా మాలిక్ ఏక్ హై అని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులు సమీరా సుల్తానాను అభినందించారు.
ఈ కార్యక్రమ నిర్వహకులుగా సామాజిక కార్యకర్త అలిమోద్దీన్ సజ్జు, న్యాయ నిర్ణేతలుగా సమీ, గఫుర్,ఖాజీ జునేద్, అదేవిధంగా ఆసిఫ్, మన్సూర్ తదితరులు ఉన్నారు