మీరు Private Job చేస్తున్నా...నెల నెల పెన్షన్ పొందాలంటే
ఇటీవలి కాలంలో పెన్షన్ స్కీమ్స్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. రిటైరయ్యాక ప్రతి నెలా డబ్బు వచ్చేలా పెన్షన్ స్కీమ్లవైపు చూస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ పథకం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కీమ్లో చేరితో తక్కువ మొత్తం కడుతూనే 60 ఏళ్ల తర్వాత ప్రతీనెలా ఫిక్స్డ్ పెన్షన్ పొందవచ్చు. ఆ పథకం పేరే అటల్ పెన్షన్ యోజన (ఏపీఐ). ఈ పథకం ద్వారా భారత పౌరులందరికీ 60 ఏళ్ల వయసు తర్వాత ప్రతీనెల రాబడి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ఉంటుంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ స్కీమ్లో ఉపయోగపడుతుంది. అలాగే జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద ఉన్న పథకంలో చేరి రోజుకు రూ.7 చెల్లించడం ద్వారా 60 ఏండ్ల తర్వాత రూ.5వేల వరకు పెన్షన్ పొందవచ్చు
బ్యాంకు అకౌంట్ ఉండి.. 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న భారత పౌరులందరూ అటల్ పెన్షన్ యోజనకు అర్హులు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆధార్ లింక్ అయి ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ పథకం కింద ఉన్న వారు బ్యాంకు ఖాతాలో 20ఏళ్ల పాటు డబ్బు జమ చేయాలి.
అటల్ పెన్షన్ యోజన వివరాలు:
18 ఏళ్ల వయసు ఉన్న వారు ప్రస్తుతం ఈ స్కీమ్లో చేరితే నెలకు రూ.210 చెల్లించాలి. అంటే రోజుకు 7 రూపాయలు అన్నమాట. ఈ పథకంలో చేరితే ఈ మొత్తం నెలకు ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఇంత మొత్తం ప్రతీనెలా చెల్లిస్తే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి నెలా
రూ.5వేల వరకు పెన్షన్
అయితే తక్కువ పెన్షన్ చాలనుకుంటే ఇప్పుడు తక్కువ మొత్తం కూడా చెల్లించవచ్చు. ఆ స్కీమ్ కింద ఇప్పుటి నుంచి నెలకు రూ.42 కడితే 60 ఏండ్ల వయసు తర్వాత రూ.1000 పెన్షన్ వస్తుంది. అదేవిధంగా నెలకు రూ.84 కడితే రూ.2,000, రూ.126 కడితే రూ.3,000, రూ.168 కడితే రూ.4,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకానికి నామినేషన్ పద్ధతి కూడా ఉంది. ఒకవేళ ఈ పథకంలో ఉన్న వారు దురదృష్టవశాత్తు చనిపోతే నామినేషన్ ఎవరి పేరు ఉంటే వారికి లబ్ధి చేకూరుతుంది. నామినేట్గా ఉన్న వ్యక్తి బ్యాంకులు వెళ్లి డిపాజిట్ మొత్తాన్ని, పెన్షన్ లాభాలను పొందవచ్చు.