సిద్ధిపేటలో ప్రత్యేక ఆకర్షణగా..సుడా హరిత పార్కు..!
తెలంగాణ రాష్ట్ర పక్షి ఎగిరే పాల పిట్టలు, జాతీయ ధర్మ చక్రమైన అశోక చక్రం, జాతీయ చిహ్నమైన మూడు సింహాల బొమ్మ, కనువిందు చేసేలా పచ్చని చెట్లు, పచ్చికబయళ్లు, గ్రీన్ లాన్.., రాత్రిపూట వెలుగులు విరజిమ్మే ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులతో సిద్ధిపేట టూ సిరిసిల్లా రహదారికి సుడా హరిత పార్కు కొత్త అందాన్ని తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సిరిసిల్లా రోడ్-రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రూ.54 లక్షలతో ఏర్పాటైన సుడా హరిత పార్కును మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా వైస్ ఛైర్మన్ కే.వీ.రమణాచారి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు బర్ల మల్లిఖార్జున్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.