అభిమానం చాటుకున్న పీజీ రసాయనశాస్త్ర విద్యార్థులు
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని 2019-2021 విద్యాసంవత్సరానికి చెందిన పీజీ రసాయనశాస్త్ర విద్యార్థులు డిపార్ట్మెంట్ పై తమకున్న అభిమానంతో సుమారు 10,000 పదివేల రూపాయల విలువ గల 4 సీలింగ్ ఫాన్స్ మరియు 10 ఎల్.ఈ.డి ట్యూబ్లైట్ లను విభాగానికి బహుమతిగా ఇవ్వడం జరిగినది.అదేవిధంగా 2018-2020 విద్యాసంవత్సరానికి చెందిన విద్యార్థులు సుమారు 7,000 ఏడువేల రూపాయలు విలువ గల వాటర్ ఫ్యూరీఫైర్ ని బహుకరించడం జరిగినది.కళాశాలపై తమకున్న అభిమానాన్ని చాటినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డా.సి.హెచ్.ప్రసాద్, విభాగాధిపతి ఖాజా బీ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పీజీ అధ్యాపకులు సతీష్ కుమార్, స్వప్న, రాణి మరియు కళాశాల అధ్యాపకులు డా. కె.హుస్సేన్,డా. గోపాలసుదర్శనం,డా.మధుసూదన్,
డా.అయోధ్యారెడ్డి, శ్యామ్ సుందర్, సలీంపాషా, బాలకిషన్, డా.మనోహర్, డా.జ్యోతి, జ్యోత్స్న, శారద, కరుణ మరియు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.