వ్యాక్సినేషన్ కి సహకరించండి
గౌరవ మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి గారు వ్యాక్సినేషన్ పై సిద్దిపేట ముస్లిం మైనారిటీ పెద్దలతో నేరుగా తంజీమ్ ఉల్ మసాజిద్ కార్యాలయంకు వెళ్లి వారితో సమావేశం నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అతి ముఖ్యంగా ముస్లిం ప్రాంతాలలో నివసిస్తున్నవారు వ్యాక్సిన్ తీసుకునేలా చైతన్య పరచాలని మరియు రేపు శుక్రవారం కాబట్టి జుమ్మా నమాజ్ ఉన్నందున అట్టి నమాజ్ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ పై మైక్ అనౌన్స్మెంట్ ద్వారా వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలన్నారు. ఇట్టి సమావేశంలో వారు మూడు కోవిడ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కమీషనర్ గారిని కోరగా వెంటనే వారు కోరిన ప్రాంతాల్లో కోవిడ్ కేంద్రాలకు కమీషనర్ గారు అనుమతి తెలిపారు. వ్యాక్సినేషన్ కొరకు సహకరిస్తున్న ముస్లిం మత పెద్దలకు గౌరవ కమీషనర్ గారు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి సమావేశంలో మత పెద్దలు MA. సమి, షేక్ ఉబేద్ హుస్సేన్ ,సయ్యద్ తంజీమ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి అందరిని వ్యాక్సినేషన్ వేసుకునేలా చైతన్య పరచాలని తెలిపారు.