ఈ నెల 22న సిద్దిపేటలో ఋణమేళా
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర గల కొండ భూదేవి గార్డెన్ లో ఈ నెల 22న ఋణ మేళాను నిర్వహించునట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్.లక్ష్మి ప్రసాద్ తెలిపారు.ఈ సందర్బంగా ఎల్.డి.ఎం సోమవారం విలేకర్లతో మాట్లాడారు ఆయా బ్యాంకులకు సంబంధించిన ఋణ స్టాల్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు,ఇందులో వ్యక్తిగత రుణాలు,గృహ రుణాలు,వాహన కొనుగోలు రుణాలు,విద్య,నాబార్డు,వ్యవసాయ మరియు టర్మ్ ఋణాలతో పాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర సంక్షేమశాఖల,స్వయం ఉపాధి,మహిళా సంఘాల రుణాలకు సంభందించిన అర్హులైన వారికీ అవగాహనతో పాటు స్టాల్ వద్దనే రుణదరఖాస్తులు స్వీకరించనట్లుగా తెలిపారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఋణ మేళా కొనసాగుతుందని వివరించారు.ఈ రుణ మేళాను జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారు అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.