اردو میں پڑھیںRead in Englishపార్ట్ టైం అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, Siddipet News | జాబ్స్
Download Siddipet News Android App: Click Here

పార్ట్ టైం అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పార్ట్ టైం అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని చేగుంట అప్ గ్రేడెడ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు, గణిత, ఆర్థిక, వాణిజ్య, పౌర శాస్త్రాల అధ్యాపక పోస్టులతోపాటు మెదక్ (బాలికల) గురుకులంలో గణితం, భౌతిక,   నర్సాపూర్ (బాలికల) గురుకులంలో జీవ, భౌతిక శాస్త్రం, నర్సాపూర్ బాలుర గురుకులంలో   తెలుగు, చేగుంట (బాలికల) గురుకులంలో ఇంగ్లీషు ఉపాధ్యాయ పోస్టులు ఆంగ్ల మాద్యమంలో పార్ట్ టైం పద్ధతిన బోధించేందుకు అర్హత గల్గిన అభ్యర్థులు ఈ నెల 20 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు మెదక్ మినీ గురుకులంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆ సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో సెకండ్ డివిజన్ 55 శాతం మార్కులతో పీజీ, బీఈడీ సెకండ్ డివిజన్, టెట్ పేపర్ - 2 అర్హతలు పూర్తి చేసి ఉండాలన్నారు.  బాలికల గురుకులంలో మహిళలు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఈ నెల 30 న నర్సాపూర్ లోని అల్లూరి సీత రామరాజు గురుకులంలో డెమోలు నిర్వహిస్తామని చెప్పారు. ఖాళీల్లో హెచ్చుతగ్గులుంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు
జాబ్స్